ఈ ఏడాది నన్ను కథల పురుగు తొలిచినట్లుంది. కరువు తర్వాత వరద. నా తాజా కథ ‘ప్రళయం‘, ఈ వారం సారంగలో ప్రచురితం. ఇది నా ఏడో కథ; ఈ ఏడాదిలో నాలుగో కథ. ఇలస్ట్రేషన్ కూడా నేనే గీసుకున్న తొలి కథ.
ఈ కథకి నేను రాసుకున్న తొలి ప్రతి ముప్పయ్యారొందల పదాల పైచిలుకుంది. మూడ్నాలుగు సార్లు తిరగరాసి, అనవసరం అనుకున్న భాగాలు తీసేశాక మిగిలింది రమారమి మూడువేల పదాలు. తొలగించిన భాగాలు ఊరకే పారేయకుండా, ఈ కథకి కొనసాగింపు రాస్తే దానిలో వాడుకునే ఆలోచనుంది. సీక్వెల్ వస్తే గిస్తే వచ్చినప్పుడు చూడొచ్చు; ప్రస్తుతానికి ‘ప్రళయం’ సంగతేంటో చూడాలనుకునేవారికి లంకె ఇక్కడ లభిస్తుంది.
మీ మాట